చవటలు, సన్నాసులు, దద్దమ్మ మంత్రులకు కేసీఆర్ నాయకత్వం వహిస్తున్నారని టీడీఎల్‌పీ ఉప నేత రేవంత్‌రెడ్డి ఘాటుగా విమర్శించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో సోమవారం జరిగిన మినీ మహానాడులో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన సీఎంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మందులో సోడాలు పోసే వారికి, తన చెప్పులు నాకే వారికి కేసీఆర్ మంత్రి పదవులిచ్చి పాలన కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు. గతంలో తరచూ తన పార్టీ ఎమ్మెల్యేతో రాజీనామాలు చేయించి నాటకాలాడే కేసీఆర్ ఇప్పుడు ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేతో రాజీనామాలు చేయించగలరా? అని సవాల్ విసిరారు. కేసీఆర్ అమెరికా పర్యటనకు వెళ్లిన తర్వాత రాష్ట్రంలో అసలైన రాజకీయం ఆవిష్కృతం అవుతుందన్నారు.

టీడీపీని ఖాళీ చేస్తామనడం ఫాంహౌస్‌లో మందు సీసా ఖళీ చేసినంత ఈజీ కాదని టీడీఎల్‌పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ మాట్లాడుతూ కార్యకర్తల అండ ఉన్నంత వరకు టీడీపీకి ఎదురులేదన్నారు.


Advertisement

0 comments:

Post a Comment

 
Top